Type Here to Get Search Results !

Sports Ad

ఉపసర్పంచ్ గోవిందప్ప పై దాడి చెసిన సర్పంచ్


ఉపసర్పంచ్ గోవిందప్ప పై దాడి చెసిన సర్పంచ్ 

  • దళిత ఉపసర్పంచ్ గోవిందప్ప ను కులం పేరుతో దుశించి దాడి చేసిన వారి ని వెంటనే అరెస్ట్ చేయాలి
  • కెవిపిఎస్ దళిత ప్రజాసంఘాల డిమాండ్
తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం మీట బాసుపల్లి గ్రామంలో దళిత ఉపసర్పంచ్ గోవిందప్ప ను కులం పేరుతో దుశించి దాడి చేసిన వారిని సర్పంచ్ పట్లోళ్ల నరేందర్ రెడ్డి,మహేందర్ పటేల్ మరియు సర్పంచ్ అనుచరులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదివారం రోజున తాండూర్ ఆర్డివో కార్యాలయం లో సీనియర్ అసిస్టెంట్ గారికి కెవిపిఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్బంగా కెవిపిఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య మాట్లాడుతూ తాండూర్ మండలం మీట బాసుపల్లి గ్రామం లో దళిత ఉపసర్పంచ్ గోవిందప్ప  గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు నిర్మాణం చేయడం ఆపివేయాలని గ్రామ రచ్చ కట్ట ముందల సర్పంచ్ గారిని ప్రశ్నించి  నందుకు అతని పై వెంబడి పడీ,దాడి చేసి కులం పేరుతూ దుశించిన వారి పై ఎస్సి,ఎస్టీ కేసు నమోదు అయి 30 రోజుల గడిచిన కూడా అరెస్ట్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న అధికారుల పై చర్యలు తీసుకోవాలి అని సర్పంచ్ పట్లోళ్ల నరేందర్ రెడ్డి మరియు అతని అనుచరులు దళిత ఉపసర్పంచ్ అయినేందుకు కుల దూరహంకారం తో కక్ష గట్టి దళితుడు నాకు పేరు పెట్టి పిలవడం ఏమిటని దౌర్జన్యం చేసి కులం పేరుతో దుశించి దాడి చేసిన నింది తులని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. లేనిచో కెవిపిఎస్ మరియు దళిత ప్రజాసంఘాల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ ఆఫీస్ ముట్టడి చేస్తానని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బాధితుడు ఉపసర్పంచ్ గోవిందప్ప, మరియు కెవిపిఎస్ తాండూర్ మండల నాయకులు  జైపాల్, గ్రామస్తులు పెంటప్ప, అనంతప్ప తదితరులు పాల్గొన్నారు.


చెంగోల్ గ్రామంలో 131వ  మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి 

తాండూర్: తాండూర్ మండలం చెంగోల్ గ్రామంలో అంబేద్కర్ యువజన నాయకులు 131వ  మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి  ఘనంగా జరుపుకున్నారు.సంఘ నాయకులు అంబదాస్ ఎచ్డిఎస్ఎస్  మాట్లాడుతూ భారత దేశ ఆధునిక యుగ వైతాళికుడు ఆయన, నిజమైన పునరుజ్జివన ఉద్యమ పిటమహుడు ఆయన, అణగారిన వర్ణాలను అగ్రవర్ణాల నుండి కాపాడిన మహనీయులు. అమెరికా లోని నల్లజాతి బానిసలాగా బాసిన బ్రతుకులు బ్రతుకుతారని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి ఆయనే జ్యోతిరావు పూలే బానిస తత్వానికి  వ్యతిరేకంగా పోరాటమే ప్రథమ కర్తవ్యంగా తాను ప్రజలను చైతన్యపరిచి పోరాటాన్ని నడిపిన ఆ మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే.

సమాజంలో వెనుకబడిన వర్గాల, కులాల, మహిళల అభ్యునతికి, చేసిన కృషికి ఆయనను మహాత్మా అనే బిరుదు ఇచ్చుకున్నారు. సామాజిక తత్వవేత్త, సమన్యాయ శోధకుడు భారత దేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్త్రీయంగా రూపొందించిన మహనీయుడు. సమసమాజ స్థాపన కోసం పరితపించే వ్యక్తి అందరూ సమానమే అని పూణేలో తొలిబాలికల పాఠశాలను 1848 నెలకొల్పాడు.1855లో2 పాఠశాలలను ఏర్పాటు చేశాడు. ఆనాడు సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు విద్య నేర్చుకొని ఇతర రంగాలలో అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదు అని చాలా గట్టిగా అభిప్రాయపడ్డాడు. మనమందరము మహాత్మా జ్యోతిబా పూలే వారసులంగా ఆయన ఆశయాలను నెరవేర్చే కొందాం అని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమాలలో అంబేద్కర్ యువజన నాయకులు గ్రామస్తులు పాల్కొన్నారు. 




Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies