Type Here to Get Search Results !

అక్రమంగా గుట్కాల వ్యాపారం చేస్తున్న వారి పై కేసు


అక్రమంగా గుట్కాల వ్యాపారం చేస్తున్న వారి పై కేసు

  • బషీరాబాద్  మరియు మైల్వార్ గ్రామంలో తనిఖీలు
  • ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి,సిఐ జలెంధర్ రెడ్డి పోలీసులు బృందం  
బషీరాబాద్ : బషీరాబాద్ మండల పరిధిలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాలనుసారంగా బషీరాబాద్ ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి గారు తనిఖీలు చేశారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బషీరాబాద్  మరియు మైల్వార్ గ్రామంలో ఏక కాలంలో దాడులు నిర్వహించగా బషీరాబాద్ గ్రామంలోని బజార్లో కిరాణ దుకాణం మైలపురం సుధాకర్ తండ్రి పేరు పాండయ్య వయస్సు 52 సంవత్సరలు బషీరాబాద్ గ్రామం తన యొక్క కిరణ షాపు గోదంనందు ప్రభుత్వం చేత నిషేదించబడిన గుట్కా,జర్దా మరియు పొగాకు మసాలా ప్యాకెట్లు వాటి యొక్క విలువ సుమారు 93,440/- రూపాయులు.

 మైల్వార్ గ్రామంలో చిదిరి గోపాల్ తండ్రి పేరు మానయ్య వయస్సు 40 సంవత్సరలు గారి కిరణ షాపులో గుట్కా,జర్దా మరియు పొగాకు మసాలా ప్యాకెట్లు 10,300/- రూపాయులు విలువగలవి మొత్తం కలిపి 1,03,740/- సామాను లభ్యం చేసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నిషేదించబడి,ప్రజల ప్రాణాలకు హాని కలిగించేటటువంటి  గుట్కా,జర్దా మరియు పొగాకు ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని వారి పై కేసు నమోదు చేయడం జరిగింది.ఇటువంటి అక్రమ వ్యాపారం చేస్తే వారి పై చట్టరిత్యా చర్యలు తిసుకుబడుతాయి.బషీరాబాద్ ఎస్ఐ మరియు పోలీసులను అభినందించారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies