ఘటన స్థలంలో పోలీసులు,బోయిని నాగప్ప మృత దేహం
బషీరాబాద్ : ఇంటి స్థలం విషయం లో తగాదాలు మనసులో పెట్టుకొని ఓ దివ్యాంగుడి హత్య చేశారు.ఈ ఘటన బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో చోటు చేసుకుంది.అదే గ్రామానికి చెందినా బోయిని నాగప్ప వయస్సు 46 సంవత్సరాలు తండ్రి పేరు నారాయణ మృతుడు బతుకు దెరువు నిమిత్తం హైదరబాద్ లో వంట చేస్తూ బ్రతికేవాడు.
ఆదివారం రోజున రాత్రి సుమారు 9:00 PM గంటల ప్రాంతంలో తన గ్రామానికి వచ్చి నేరుగా నిందితుడు నాగప్ప తండ్రి పేరు గైబన్న వయస్సు 40 ఏళ్ల ఇంటికి వెళ్లి అతనితో గొడవ పడ్డాడని విచారణలో తేలింది. ఈలోగా నిందితుడు బోయిని నాగప్పను చేతులతో కొట్టడంతో పాటు కడుపుపై తన్నడంతో అంతర్గతంగా గాయాలు కావడంతో ఈలోగా మృతుడి బావ బోయిని నర్సింలు అక్కడికి వచ్చి రక్షించడు.నాగప్ప మృత దేహాని ఇంటి ముందు పడేసి వెళ్ళిపోయారు.
మెయిన్ డోర్ ముందు పడుకునేలా చేశాడు. సోమవారం తెల్లవారుజామున దాదాపు 8:00 AM గంటల సమయంలో నర్సింలు అక్కడికి వెళ్లి చూడగా అతడు మృతి చెంది ఉండడంతో మృతుడి భార్య అనసూయ పోలీసులకు పోన్ ద్వారా ఇచ్చిన సమాచారం ప్రకారం ఘటన స్థలానికి వెళ్లి ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి,సిఐ జలంధర్ రెడ్డి పరిశీలించారు. నిందితులిద్దరినీ పట్టుకుని పీఎస్కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తాండూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.నాగప్ప భార్య అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.
Crime chala jarguthundi
ReplyDelete