మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు An accident with a bus going to Medaram injured several people
Bharath NewsFebruary 21, 2024
0
మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం పలువురికి గాయాలు
మేడిపల్లి Medipally Newsభారత్ ప్రతినిధి : మన మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు.ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.