గుడ్ న్యూస్ 607 పోస్టులకు నోటిఫికేషన్ రూ. 2 లక్షల వరకు వేతనం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణ నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేసేందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో 8 వేల కొలువులు భర్తీ చేసింది.
మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. జోన్ - 1 పరిధిలో 379, జోన్ 2 పరిధిలో 228 ఖాళీలను భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. జులై 10వ తేదీ నుంచి దరఖాస్తుల ను ఆన్ లైన్ లో స్వీకరిస్తారు. జులై 17ను దరఖాస్తు లకు చివరి తేదీగా నిర్ణయించారు. 18, 19 తేదీల్లో అప్లికేషన్స్ ఎడిట్ కోసం ఆప్షన్ ఇచ్చారు. దరఖాస్తు చేసుకొనే వారు పోస్టుల వారీగా ఆన్ లైన్ లో అర్జీలు పెట్టాలని సూచించారు. ఈ పోస్టులకు యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం రూ. 68,900- నుంచి 2 లక్షల 500 మధ్య వేతనం ఉంటుందని వివరించారు.