కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు
క్రీడా వార్తలు భారత్ ప్రతినిధి : టీమిండియా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడే అవకాశం కనిపిస్తోంది. ఐపీఎల్ విన్నర్ ఆర్సీబీ విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి శుక్రవారం బెంగళూరులో కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది.
11 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ తొక్కిసలాటకు కోహ్లీ కూడా బాధ్యుడేనని నైజ హోరాటగారర వేదికే అనే సంస్థ తరఫున ఎ.ఎం. వెంకటేష్ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు చేశారు. కోహ్లీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చేసిన ఈ ఫిర్యాదును పోలీసులు స్వీకరించారు. తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇప్పటికే నమోదైన ఎఫ్ఐఆర్తో పాటు వెంకటేష్ ఫిర్యాదును కూడా దర్యాప్తు కోసం పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు.