అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు కొత్త షెడ్యూల్ ఇదే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల అప్లికేషన్ తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MSRB). కొత్త షెడ్యూల్ ను కూడా విడుదల చేసింది. మొత్తం 607 పోస్టులకు జులై 10 నుంచి 17వ తేదీల్లో దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా, డాక్టర్ల విజ్ఞప్తి మేరకు ఈ తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటిచింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం జులై 20 నుంచి 27వ తేదీ వరకూ దరఖాస్తులు తీసుకోనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది బోర్డు. ఈ నెల 20 నుంచి బోర్డు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు సమయంలో బోర్డు వెబ్సైట్లో అన్ని సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాలని పేర్కొంది.
మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, కుల ధృవీకరణ, తదితర సర్టిఫికెట్లు తెచ్చుకోవడానికి కొంత సమయం కావాలని డాక్టర్లు విజ్ఞప్తి చేయడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నది.