Type Here to Get Search Results !

Sports Ad

అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి




అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

వికారాబాద్ : పెద్దేముల్ మండల పరిధిలోని గొట్లపలి లో జరిగిన ఘటన అంబేద్కర్ విగ్రహం కు అవమానం జరిగింది పోలీస్ లకు పిర్యాదు చేస్తున్నారు. Dr.BR.అంబేద్కర్ విగ్రహం వెలు, చేవ్వు, విరగొట్టి అవమనపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీస్కొని కటినంగా శిక్షించాలని అంబేత్క్ ర్ సంఘం నాయకులు కెవిపిఎస్ నాయకులు నిరసన తెలుపుతూ పోలీస్ లకు పిర్యాదు చేసినరు వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు లేనిచో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని గొట్లపల్లి హన్మపుర్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొని హెచ్చరిస్తున్నారు.

స్థానిక పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ,కెవిపిఎస్ 
 స్థానిక పెద్దేముల్ మండల్ గొట్లపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వేలు,చేవ్వు విరగ్గొట్టి అవమానపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చెయ్యాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ )వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ స్థానిక పెద్దేముల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహం పై దాడి చేసి అవమానపరిచిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది లేనిచో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు , కెవిపిఎస్ ,ఎస్ఎఫ్ఐ, అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొనడం జరిగింది.



ఎస్పీ నారాయణ కు మద్దతుగా వివిధ శాఖల అధికార యంత్రంగం
  • జిల్లా ఎస్పీ నారాయణ పై లేనిపోని ఆరోపణలు ఎందుకు ఇంత కుట్ర ఎందుకు
  •  ఎస్పీ నారాయణ కు మద్దతుగా నిలుస్తున్న వివిధ శాఖల అధికార యంత్రంగం
  •  ప్రజల్లో లభిస్తున్న ఆదరణ, మద్దతు,ఆరోపణలు చేస్తున్న వారి నేర చరిత్రను సేకరిస్తున్న ఇంటెలిజెన్సీ వర్గాలు
వికారాబాద్ : వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ పై వారం రోజుల నుంచి కొన్ని సంఘాలు విమర్శలు చేస్తు నారాయణ ను సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేయడంతో జిల్లా వ్యాప్తంగా సర్వత్ర చర్చ జరుగుతుంది. వారం రోజుల నుంచి నారాయణను సస్పెండ్ చేయాలనీ వికారాబాద్ జిల్లాల్లోని పరిగి, కొడంగల్, వికారాబాద్, తాండూర్ నియోజకవర్గ కేంద్రల తోపాటు కొన్ని మండల కేంద్రలలో కొన్ని సంఘాలు నిరసన వ్యక్తం చేస్తూ తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా నే నేడు బుధవారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయాలనీ కొన్ని దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. ఇదే విషయంమై ప్రతి రోజు పేపర్లలో రచ్చ రచ్చ ప్రకటనలు రావడంతో ప్రజలు అయోమ యానికి గురవుతున్నారు. ముక్యంగా మేధావి వర్గాల, విద్యావంతులు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు చాలా ఆసక్తి చూపుతూ ఈ విషయం పై దృష్టి సరించారు. పరిగి నియోజకవర్గం దోమ మండలం రకొండ గ్రామంలో డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొలపకుండా జిల్లా ఎస్పీ నారాయణ పై లేని పోనీ ఆరోపణలు ఎందుకు ,ఆ గ్రామ సర్పంచ్, మరి కొందరు అడ్డపడ్డారని వారిని అరెస్ట్ చేయకుండా అధికార పార్టీ నేతలకు బయపడీ ఎస్పీ నారాయణ మద్దతు ఇస్తేన్నారని కొన్ని దళిత సంఘాలు ఆరోపణలు చేస్తూ వారం నుండి రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం రోజు రోజుకు అందరి దృష్టి తో పాకిపోవడం తో ఎస్పీ నారాయణ కు ప్రజల్లో, ప్రభుత్వ శాఖ అధికారాలు, సిబ్బంది, వివిధ పార్టీ నేతల నుండి మద్దతు పెరిగిపోతుంది. ఒక జిల్లా అధికారి, ముక్యంగా శాంతి భద్రత లు కాపాడే ఒక పోలీస్ అధికారి పై ఆరోపణలు చేస్తూ ఏకంగా సస్పెండ్ చేయాలనే డిమాండ్ చేయడం, అంతటితో  ఆగకుండా రెవిన్యూ శాఖకు చెందిన అధికారులు మెమోరాండలు, ఇవ్వడం ఏమిటని పోలీస్ శాఖ తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒక గ్రామంలో జరిగిన సంఘటన ఆ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ ఎస్ఐ సీఐ తో పాటు డిఎస్పి చూసుకుంటారని, ఆ విషయాలను గమనించకుండా ఏకంగా ఎస్పీ ని సస్పెండ్ చేయాలనీ రచ్చ చేయడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయానికై ప్రభుత్వ నిబంధనలు ఉంటాయని, ఆ గ్రామంలో సర్పంచ్ విగ్రహ ప్రతిష్టపనకు అనుమతి ఇవ్వవలసి ఉంటుందని, అక్కడ చేర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాల్సిన విషయాన్నీ వదిలి జిల్లా ఎస్పీ ని సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేయడం ఏమిటని అందరిలో ఉత్కంట త రేపుతుంది.చిన్న చిన్న విషయాలలో కూడా జిల్లా ఎస్పీ ని లాగడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లా ఎస్పీని సస్పెండ్ చేయాలనీ కొందరు డిమాండ్ చేయడం, వారివెంట ఎవరైనా రాజకీయ నేతలు, కొన్ని శాఖలా అధికారుల అండఉన్నదా అనే ప్రశ్న ఉత్పమవుతుంది. జిల్లా ఎస్పీ నారాయణ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వికారాబాద్ జిల్లాలో శాంతి బాధ్రతలు కాపాడటంలో మంచి పేరు సాధించుకున్నారు. అవినీతి అక్రమాలను అరికట్టడం తో పాటు జిల్లాలో ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ టీం ను ఏర్పాటు చేసి ఇసుక అక్రమ రవాణా, మట్కా కు కళ్లెం వేసి, గుట్కా వ్యాపారానికి బ్రేక్ వేశారు. ఈ అక్రమ వ్యాపారాలు చేసే ఎంతో మందిని పట్టుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదు చేయించారు.ఫ్రెండ్లీ పోలీస్ సిస్టమ్ ను కొనసాగిస్తూ అనేక ప్రాంతాలలో అవేర్న్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న వివిధ సేవ కార్యక్రమలు కూడ చేపట్టారు. ఎవ్వరు తప్పు చేసిన సహించకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్న ముక్కుసూటిగా వ్యవహరించే వ్యక్తి గా జిల్లాల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ కోణంలో వారం రోజుల నుంచి కొన్ని ఆరోపణలు రావడంతో ఎక్కడ చుసిన ఇదే రచ్చ కొనసాగుతుఎస్పీ నారాయణకు మద్దతు పలికే వరు పెరిగి పోతున్నారు. చిన్న విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని ఎస్పీ ని టార్గెట్ చేయడం ఏమిటని పోలీస్ శాఖకు చెందిన అధికారులే పేర్కొంటున్నారు. కేసులు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టే బాధ్యత మాపై ఉంటుందని, అవసరమైన కేసులను ఎస్పీ పై నెట్టడం ఏమిటని కొందరు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా జిల్లాలో జరుగుతున్న రచ్చ గురించి రాష్ట్ర స్థాయి పోలీస్ అధికారుల దృష్టికి పోకపోవడంతో జిల్లాలో అసలు ఏమి జరుగుతుంది, ఎస్పీ తిరుతేన్నులను గురించి ఎస్పీ పై ఆరోపిస్తున్న వివిధ పార్టీలకు చెందిన నేతల గురించి, వారివారిపై ఎన్ని పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యి ఉన్నాయో వివరాలు వెల్లడించారాని ఇంతలిజెన్సీ అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఆదేశాల్లతోని మంగళవారం నాడు ఇంటెలిజెన్సీ అధికారులు బిజీబిజీగా తాండూర్, కొడంగల్, పరిగి, వికారాబాద్, దోమ, కుల్కచర్ల, కారణకోట్, యాలల, ధరూర్ పోలీస్ స్టేషన్ లలో నమోదు అయినా కేసుల వివరాలను తీసుకొని ఉనతధికారులకు పంపినట్లు విశ్వసనియా వర్గాల ద్వారా తెలుస్తుంది.వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 


ఉపసర్పంచ్ పై ఆగిపోయిన అవిశ్వాసం
బషీరాబాద్ : ఉపసర్పంచ్ పై పెట్టిన అవిశ్వసం ఆగిపోయింది. బషీరాబాద్ మండల పరిధిలోని గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ శాంత్ కుమార్ పై అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని చేసిన పనులపై బిల్లులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని వార్డు సభ్యులు ఉపసర్పంచ్ శాంత్ కుమార్ పై అవిశ్వస తీర్మానం పెట్టారు. ఈ అవిశ్వస తీర్మాణాన్ని నవంబర్ 20 వ తేదీన ఉపసర్పంచ్ తొలగిస్తున్నట్లు ఆమోదం చేస్తామని ఆర్థివో వెల్లడించారు.ఈ విషయం తెలుసుకున్న ఉపసర్పంచ్ శాంత్ కుమార్ కోర్టును ఆశ్రయించి నాపై లేనిపోని ఆరోపణలు ఎచసి 1994 చట్టం ప్రకారం తొలగించాలని అవిశ్వసం పెట్టారు. అది చెల్లక పోవడంతో తిరిగి 2018 చట్టం ప్రకారం మరొకసారి అవుశ్వస తీర్మానం నిర్ణయించి నోటీసు ఇచ్చారు. దీంతో కోర్టును ఆశ్రయించిన శాంత్ కుమార్ నాకు రెండు సార్లు నోటిస్ ఎలా ఇస్తారని నాపై అవిశ్వసం ఎలా చెల్లుతుందని కోర్టును ఆశ్రయించడంతో శాంత్ కుమార్ పై పేట్టిన అవిశ్వసన్ని నిలిపి వేయాలని కోర్టు స్టే ఇవ్వడంతో శాంత్ కుమార్ పై ఉన్న అవిశ్వస తీర్మానం నిలిచి పోయింది. దీంతో ఉపసర్పంచ్ శాంత్ కుమార్ టీఆరెఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాము నాయాక్, వల్య నాయక్, తండా సర్పంచ్ శివ, మోహన్, వెంకటప్ప,తదితరులు కలిసి గ్రామ పంచాయతీ ఆవరణలో మిఠాయిలు తినిపించుకున్నారు.


 బషీరాబాద్ మండలంలో భారీగా మద్యం విక్రయలు
  •  తాగుడుకు బానిసలవుతున్న యువత 
  •  ధాబాల్లో మద్యం బాబూల సిట్టింగ్
బషీరాబాద్ : మండల వ్యాప్తంగా బెల్ట్ షాపు ల దందా జోరుగా సాగుతోంది. ప్రతి ఊరులో గల్లీ గల్లీ కి వెలిసిన దుకాణల్లో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఏ గల్లీ లో చుసిన అధికార వైన్ షాపునకు పోటీగా జనాలు బెల్ట్ షాపుల వద్ద మద్యం కొంటున్నారు.ఇంత జరుగుతున్న ఎక్సయిజ్ పోలిసులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు.
 మండల వ్యాప్తంగా బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. మండలంలో 36 గ్రామ పంచాయతీలు ఉండగా మరో పది అనుబందా గ్రామాలు తండాలు ఉన్నాయి 500 నుంచి 1000 జనాభా ఉన్న గ్రామంలో ఐదరు బెల్ట్ షాపులు కొనసాగుతుండగా,2 నుంచి 4 వేల వరకు జనాభా ఉన్న మేజర్ గ్రామ పంచాయతీలో 8నుంచి 10 బెల్ట్ షాప్ లు నడుస్తున్నాయి. ఒక్కో బీరు బాటిల్ క్వార్టర్ కు 10 నుంచి 20 రూపాయలు అదనంగా వాసులు చేస్తున్నారు.ఈ బెల్ట్ షాప్ నిర్వహకులు బషీరాబాద్ లోని బెల్ట్ షాపుల్లో మద్యం తీసుకెళ్లి గ్రామాల్లో అమ్ముతున్నారు. బషీరాబాద్ -తాండూర్  రోడ్డులో పాలు చోట్ల ధాబాలు వెలిచ్చాయి. అవి పేరుకే ధాబాలు ఖని, అక్కడ మద్యం ప్రియులకు సకల సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి. నావంద్గి రోడ్డులోని ఓ ధాబాలో మద్యం నిల్వ ఉంచి నిరతకంగా అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ ధాబా ప్రాంతం కర్ణాటక సరిహద్దు గ్రామాలకు దగ్గరగా ఉండడంతో నిత్యం మద్యం తాగేందుకు వచ్చే వారి తాకిడి ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెప్తున్నారు. ఈ ధాబాకు భోజనానికి వచ్చిన వరు మద్యం కొనుక్కొని తాగుతున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం ఎక్సయిజ్ ట్రైని ఎస్ఐ, పోలీసు సిబ్బంది తో వచ్చి ధాబాలో తనిఖీ చేసినప్పుడు మద్యం తాగుతూ కొందరు కనిపించగా హెచ్చరించి. పంపించారు. ఉదయం, సాయంత్రం, రాత్రి తేడా లేకుండా గ్రామాల్లో మద్యం అమ్ముతున్నారు. యువకులు మధ్యానికి బానిసలవుతున్నారు. మద్యం మత్తులో తులుతు కొందరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.స్కూళ్ల మైదానంలో మద్యం ప్రియుల అడ్డా మందు బాబులు పాఠశాలలు, మైదానలు, పంట పొలాలలో తాగుతున్నారు. ఉరిచివారా, పాఠశాలలు, మైదానలను ఎంచుకుంటున్నారు. అర్ధరాత్రి వరకు అక్కడే మద్యం తగిన మైకంలో సిసలు పగల గొట్టి ఇష్టరాజ్యాంగ వ్యవహరించిన సంఘటనలు పాఠశాలల్లో వెలుగుచుషయి. రాత్రయితే గ్రామాల్లో, తాండల్లో పూటుగా మద్యం తాగి తిరుగుతూ ఇతరులకు ఇబ్బంది, కలిగిస్తున్న ఘటనలు ఉన్నాయి.ఎక్సయిజ్ అధికారులు బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.బెల్ట్ షాప్లను అరికడతాం బెల్టు షాపుల నిర్వహణ అక్రమం. గ్రామాల్లో ఎవరైనా మద్యం అమ్మితే చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తాం అంటున్న పోలీసుల బృందం.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies