ఊరడమ్మ జాతరలో
పాల్గొన్న ఎమ్మెల్యే
- సంగెంకలాన్ ఊరడమ్మ జాతరల...
- కరాంకొట్ ఊరడమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే...
- ఘనంగా స్వాగతం పలికిన గ్రామస్తులు...
తాండూరు : తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామంలో జరుగుతున్న ఊరడమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పులు, టపాసులతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామ పెద్దలు, యువకులు ఘనంగా సన్మానిచారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోన నుంచి యావత్ ప్రపంచం పూర్తిగా కోలుకుని ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి చల్లని చూపు ప్రజలపై తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ యొక్క కార్యక్రమాలలో తెరాస పార్టీ నాయకులు,గ్రామస్తులు తదితరులు పలుకొన్నారు.