Type Here to Get Search Results !

దాడి చేసి చంపిన వ్యక్తులను తప్పకుండ అరెస్టు చేయాలి

 


దాడి చేసి చంపిన వ్యక్తులను తప్పకుండ అరెస్టు చేయాలి 

  • వికలాంగుడైన నాగప్ప పైన  దాడి చేసి చంపిన వ్యక్తుల అందరిని  అరెస్టు చేయాలి 
  • ప్రజా సంఘాల అద్యక్షులు శ్రీనివాస్,కిష్టప్ప,సురేష్,బసప్ప 
  • వికలాంగుడైన నాగప్ప కుటుంబాన్ని ప్రభుత్వం వారిని ఆదుకోవాలి 
  • దాడి చేసిన వ్యక్తులను తప్పకుండ శిక్షించాలి 
  • ప్రజాసంఘాల  డిమాండ్ చేశారు

బషీరాబాద్ : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎక్మ మై  గ్రామానికి చెందిన వికలాంగుడు నాగప్పను అదే గ్రామానికి చెందిన నాగప్ప,ప్రశాంత్  రేణుక అందరు కలిసి మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా కొట్టి కారణంగా చనిపోయారు. ఆ  సందర్భంగా నాగప్ప  అక్కడికక్కడే చనిపోవడం జరిగింది నాగప్పను చంపిన వారిలో ఒకరిని అరెస్టు చేసి మిగితా వారి  కొడుకును ప్రశాంత్ ను  భార్య రేణుక ను కూడా అరెస్టు చేయాలని.

       ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాస్ మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు కిష్టప్ప కెవిపిఎస్ మండల అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ పాత కక్షలు మనసులో పెట్టుకుని గత సంవత్సర కాలం నుండి వేధింపులకు గురిచేస్తే నాగప్ప భార్య అనసూయ గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీస్ అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మళ్లీ వారు దాడి చేసి హత్య చేసినారు.

       వికలాంగుడైన నాగప్ప కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం వారిని ఆదుకోవాలని  ప్రజాసంఘాలు డిమాండ్ చేశారు ఇప్పటికైనా నాగప్ప భార్య పిల్లలకు రక్షణ కల్పించాలని దాడి చేసిన వ్యాఖ్యలపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిక.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies