బషీరాబాద్ నూతన ఎస్ఐగా వి. రమేష్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలో విఆర్ లో పని చేస్తున్న వి. రమేష్ ను బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి ఎస్ఐగా బదిలీ చేయడం జరిగింది. బుధవారం రోజు పదవి భాద్యతలు చేపట్టారు.ఇక్కడ పని చేస్తున్న ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ధరూర్ పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యారు. నూతనంగా వచ్చిన ఎస్ఐ వి.రమేష్ మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం,అక్రమ మద్యం తదితరవాటిపై ద్రుష్టి సారిస్తామన్నారు. నేరాలను అదుపులో ఉంచడానికి తనవంతు కృషి చేస్తానని ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాజకీయ నాయకులకు ప్రజలకు అందుబాటులో ఉండి ఫ్రెండ్లి పోలీసుగా అందరితో సహకరిస్తామని అన్నారు.





