Type Here to Get Search Results !

Sports Ad

భగ్గుమన్న బంగారం తులం లక్ష క్రాస్, ఇవాళ10 గ్రాములకు రూ.2వేల 120 అప్ Bhaggumanna gold price crosses Rs 1 lakh, up Rs 2,120 per 10 grams today

భగ్గుమన్న బంగారం తులం లక్ష క్రాస్, ఇవాళ10 గ్రాములకు రూ.2వేల 120 అప్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ వ్యాప్తంగా భయాలను పెంచుతోంది. ఈ వాతావరణం బంగారం ధరలను విపరీతంగా పెంచేస్తోంది. స్పాట్ మార్కెట్లో నేడు బంగారం ధర నెల గరిష్ఠానికి చేరి ఔన్సు 3వేల 428 డాలర్లుగా కొనసాగుతోంది. ఈ ఒక్కవారంలోనే గోల్డ్ 3.5 శాతం మేర పెరగటం ఆందోళనలు పెంచేస్తోంది. ఈ క్రమంలో నేడు రిటైల్ మార్కెట్లలో కూడా పసిడి ధరలు భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. 

 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.19వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 295, ముంబైలో రూ.9వేల 295, దిల్లీలో రూ.9వేల 310, కలకత్తాలో రూ.9వేల 295, బెంగళూరులో రూ.9వేల 295, కేరళలో  రూ.9వేల 295, వడోదరలో రూ.9వేల 300, జైపూరులో రూ.9వేల 116, లక్నోలో రూ.9వేల 116, మంగళూరులో రూ.9వేల 295, నాశిక్ లో రూ.9వేల 298, అయోధ్యలో రూ.9వేల 310, బళ్లారిలో రూ.9వేల 295, నోయిడాలో రూ.9వేల 310, గురుగ్రాములో రూ.9వేల 310 వద్ద కొనసాగుతున్నాయి. 

 ఇదే క్రమంలో పసిడి 100 గ్రాముల 24 క్యారెట్ల ధర నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.21వేల 200 మేర భారీ పెరుగుదలను నమోదు చేసింది.  దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 140, ముంబైలో రూ.10వేల 140, దిల్లీలో రూ.10వేల 155, కలకత్తాలో రూ.10వేల 140, బెంగళూరులో రూ.10వేల 140, కేరళలో  రూ.10వేల 140, వడోదరలో రూ.10వేల 145, జైపూరులో రూ.9వేల 944, లక్నోలో రూ.9వేల 944, మంగళూరులో రూ.10వేల 140, నాశిక్ లో రూ.10వేల 143, అయోధ్యలో రూ.10వేల 155, బళ్లారిలో రూ.10వేల 140, నోయిడాలో రూ.10వేల 155, గురుగ్రాములో రూ.10వేల 155గా ఉన్నాయి. 

 ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల 950 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష14వేలుగా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies