Type Here to Get Search Results !

Sports Ad

6 రోజుల్లో రూ.7,770 కోట్లు జమ రైతు భరోసాలో రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు State government sets record in farmer insurance by depositing Rs. 7,770 crore in 6 days

6 రోజుల్లో రూ.7,770 కోట్లు జమ రైతు భరోసాలో రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రైతు భరోసా నిధుల పంపిణీలో రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం ఆరు రోజుల్లో 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,770.83 కోట్లు జమ చేసింది. గత ఏడేండ్లలో రైతులకు ఇంత వేగంగా పెట్టుబడి సాయం నిధులను పంపిణీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, 9 రోజుల్లో రూ.9,000 కోట్లు జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 

 జూన్ 16న ‘రైతు నేస్తం’ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా చెల్లింపులను ప్రారంభించారు. శనివారం నాటికి 9 ఎకరాల్లోపు భూమి కలిగిన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. గతంలో వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం పంపిణీ గరిష్టంగా 169 రోజుల వరకు సాగిన సందర్భాలు ఉన్నాయి. అయితే, 2021లో 11 రోజుల్లో రూ.7,360 కోట్లు జమ చేసిన రికార్డును ఈసారి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అధిగమించింది. 

 కేవలం 6 రోజుల్లో రూ.7,770.83 కోట్లు పంపిణీ చేసింది. అనుకున్న సమయానికి రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం అందించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శమని వ్యవసాయ అధికారులు తెలిపారు. ఈ చర్య రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఊతం అందించడమే కాకుండా, రైతుల ఆర్థిక స్థిరత్వానికి బలమైన పునాది వేస్తుందని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies