Type Here to Get Search Results !

Sports Ad

లక్ష దాటినా ఆగని పసిడి పరుగు హైదరాబాదులో తులం ఎంతంటే The gold rush that doesn't stop even after crossing one lakh rupees is what is the value of gold in Hyderabad?

లక్ష దాటినా ఆగని పసిడి పరుగు హైదరాబాదులో తులం ఎంతంటే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ముదురుతున్న పరిస్థితులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు కష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే కొనసాగుతన్న అమెరికా ట్రంప్ టారిఫ్స్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలతో ఇబ్బందులు పడుతున్న ప్రపంచ దేశాలకు ఇజ్రాయెల్ వార్ మరిన్న కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఈ క్రమంలో చాలా మంది తమ సంపదను కాపాడుకునేందుకు ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ కారణంగా భారతదేశంలో రిటైల్ గోల్డ్ విక్రయ ధరలు కనీవినీ ఎరుగని స్థాయిలకు పెరిగిపోయాయి. 

 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో రూ.9వేల 320, ముంబైలో రూ.9వేల 320, దిల్లీలో రూ.9వేల 335, కలకత్తాలో రూ.9వేల 320, బెంగళూరులో రూ.9వేల 320, కేరళలో రూ.9వేల 320, వడోదరలో రూ.9వేల 325, అహ్మదాబాదులో రూ.9వేల 325, జైపూరులో రూ.9వేల 335, మంగళూరులో రూ.9వేల 320, నాశిక్ లో రూ.9వేల 323, మైసూరులో రూ.9వేల 320, అయోధ్యలో రూ.9వేల 335, బళ్లారిలో రూ.9వేల 320, గురుగ్రాములో రూ.9వేల 335, నోయిడాలో రూ.9వేల 335 వద్ద కొనసాగుతున్నాయి.

 ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.2వేల 800 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు చెన్నైలో రూ.10వేల 168, ముంబైలో రూ.10వేల 168, దిల్లీలో రూ.10వేల 183, కలకత్తాలో రూ.10వేల 168, బెంగళూరులో రూ.10వేల 168, కేరళలో రూ.10వేల 168, వడోదరలో రూ.10వేల 173, అహ్మదాబాదులో రూ.10వేల 173, జైపూరులో రూ.10వేల 183, మంగళూరులో రూ.10వేల 168, నాశిక్ లో రూ.10వేల 171, మైసూరులో రూ.10వేల 168, అయోధ్యలో రూ.10వేల 183, బళ్లారిలో రూ.10వేల 168, గురుగ్రాములో రూ.10వేల 183, నోయిడాలో రూ.10వేల 183గా ఉన్నాయి. 

 ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.93వేల 200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష వెయ్యి 680గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 20వేల 100 వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies