Type Here to Get Search Results !

Sports Ad

ప్రపంచ దేశాలకు భారత రాజ్యాంగం ఆదర్శం


ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగం దినోత్సవం
  • భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్  రెండు సంవత్సరాల 11నెలల 18 రోజులు

వికారాబాద్ : వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలోని గణపూర్ గ్రామ పంచాయతీలోని గోఫ్యానాయక్ తండా ప్రాథమిక పాఠశాలలో భారత రాజ్యాంగం దినోత్సవం జరుపుకోవడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్  రెండు సంవత్సరాల 11నెలల 18 రోజులు శ్రమించి రాయడం జరిగింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మనకు ఓటు హక్కు కూడా అంబేద్కర్ కల్పించారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయింది. అంటే ఆర్టికల్ 3 ప్రకారo అని మనం తెలుసుకోవాలి.రాజ్యాంగం ప్రకారం  అందరూ అన్ని హక్కులూ పొందుతున్నారు.1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. జనవరి 26,1950 నుండి రాజ్యాంగం అమలులోకి వచ్చింది . కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యారాలు కడంపల్లి లలితమ్మ, ఉపాధ్యాయులు బోరు కృష్ణయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.



అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగ దినోత్సవం

మహబూబ్ నగర్ : మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల కేంద్రంలో 72వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అంబేద్కర్ 2 సంవత్సరాల11 నెలల18 రోజులు కష్టపడి రాజ్యాంగం రాయడం జరిగింది.రాజ్యాంగం వచ్చిన తరువాత అందరికి సమానమైన హక్కులు కల్పించబడ్డాయి. పరిపాలన కూడా రాజ్యాంగం ప్రకారం జరుగుతుంది.కార్యక్రమంలో వ్యవసాయ వృత్తి దారుల యూనియన్ మండల అధ్యక్షుడు కప్లపూర్ ఆశన్న,రజక సంఘం మండల అధ్యక్షుడు చాకలి శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు బోరు కృష్ణయ్య,  గండీడ్ హన్మయ్య,రంగారెడ్డి పల్లి బోడ బాలయ్య, మల్కాయ్య, హస్నాబాద్ వెంకటయ్య, నాగరాజు, అంచన్ పల్లి రాములు, అంచన్ పల్లి శ్రీనివాస్,  చిట్యాల చెన్నయ్య, చిట్యాల బాలయ్య,రామయ్య, తదితరులు పాల్గొన్నారు


Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies