పురుగుల మందు తాగి వక్తి మృతి
బషీరాబాద్ basheerabad News భారత్ ప్రతినిధి : పురుగుల మందు తాగి వక్తి మృతి చెందాడు ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలములో పార్వత్ పల్లి గ్రామములో సోమవారం చోటుచేసుకుంది. పార్వత్ పల్లి గ్రామానికి చెందిన బొయ్య బంకుల కాశప్ప (37) ఆదివారం రోజున తన పొలంలో పంటకి పురుగుల మందు కొట్టి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కాశప్ప పిల్లలతో గొడవకు దిగాడు. అంతలో భార్య సత్యమ్మ పిల్లలతో గొడవలు ఎందుకని భర్తను మందలించగా పిల్లలని కొట్టనివ్వకుండా అడ్డుకుంటావా అని ఆవేశంతో నేను పురుగుల మందు తాగి చస్తానని ఇద్దరి మధ్యలో గొడవలు కాగా కాశప్ప పురుగుల మందు తాగేసరికి అంతలోనే భార్య ఇంటిపక్కల వారికీ చెప్పడంతో వారూ వచ్చి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ విషయంపై మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు బషీరాబాద్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ తెలిపారు.