ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలకు మరోసారి గడువు పొడిగింపు
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశ గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఫస్టియర్ ప్రవేశాల గడువు ఆగస్టు 16తో ముగిసింది. అయితే ఇంకా చేరని వారికోసం గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. అయితే ప్రైవేటు కళాశాలల్లో చేరేవారు ఆలస్య రుసుం కింద రూ.750 చెల్లించాలని, ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కాలేజీల్లో చేరేవారు మాత్రం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఇప్పటివరకు ప్రవేశాలు పొందని వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.