Type Here to Get Search Results !

మానవత్వం చాటిన మంత్రి మహేందర్ రెడ్డి Minister Mahender Reddy who showed humanity


 మానవత్వం చాటిన మంత్రి మహేందర్ రెడ్డి

వికారాబాద్ Vikarabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలము రోడ్డు ప్రమాద బాధితుని 108 అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించి చికిత్సలకు ఆదేశించిన మంత్రి మహేందర్ రెడ్డి. రోడ్డు రవాణా నిబంధనలను పాటించాలి, మంత్రి మహేందర్ రెడ్డి ప్రజలకు సూచన రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి వర్యులు డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.మున్నా మొయినాబాద్ మండలం అజిత్ నగర్ లో రోడ్డు ప్రమాదం లో మహిళ మృతి చెందిన సందర్భంగా అటుగా వెళుతూ ప్రమాదవ బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించి ము చెందిన మహిళ కుటుంబీకులకు సహాయం చేసిన విషయం మరొక ముందే వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలము కందనెల్లి గ్రామం శివారులో బైకుపై వెళుతున్న యువకులకు టిప్పర్ ఢీకొనడంతో రోడ్డుపై ప్రమాదం లో తీవ్ర గాయాల పాలయ్యారు.అదే సందర్భంగా బషీరాబాద్ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని గమనించారు.వెంటనే కాన్వాయ్ హ్యాపీ ప్రమాద స్థలానికి చేరుకున్నారు.108 కు సమాచారం అందించి, అది వచ్చేంతవరకు అక్కడే ఉండి బాధితుని ఆసుపత్రికి దగ్గరుండి తరలించారు. ప్రమాదానికి గురువైన యువకుని వివరాలను తెలుసుకొని అతనికి అవసరమైన మంచి వైద్యాన్ని అందించాలని తాండూర్ వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు.మంత్రి అవునత్యానికి ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలను పాటించాలని మంత్రి మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు.నిబంధనలను అతిక్రమిస్తే ప్రమాదాలు తప్పవని అన్నారు.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies