నేటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు షురూ
హైదరాబాద్ HYDERABAD NEWS భారత్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుండి ప్రారంభంకానున్నాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ విద్యార్థులకు ఇదే వెసులుబాటు కల్పించారు.శుక్రవారం నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలు ఉదయం 9:05 గంటలు, మధ్యాహ్నం 2 : 25 గంటల వరకు వచ్చేవారిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చేవారిని అస్సలు అనుమతించ జూన్ 3 వరకు జరిగే ఈ పరీక్షలను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు నిర్వహిస్తారు.మొత్తం 4.6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 900 పరీక్షాకేంద్రాలను ఇంటర్బోర్డు ఏర్పాటు చేసింది. విద్యార్థులు https://tsbie.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.





