డీజే లతో శబ్ద కాలుష్యం... ప్రజల ఫిర్యాదుల మేరకు డీజేల అనుమతులు రద్దు
* ఇక డీజేలు మోగితే ... బాక్సులు
* వాడితే కఠిన చర్యలే
* పట్టణ సీఐ జి. సంతోష్ కుమార్ వెల్లడి
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో శబ్ద కాలుష్యాన్ని రేకెత్తిస్తున్న డిజే సౌండ్ సిస్టం అనుమతులను పోలీసులు రద్దు చేసారు.నేడు పట్టణంలోని పోలీస్ స్టేషన్ కార్యాలయంలో స్థానిక ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ జిల్లా ఎస్పీ కోటి రెడ్డి ఆదేశాల మేరకు డిజే సౌండ్ సిస్టం యజమానులతో సమావేశం నిర్వహించారు. డిజే సౌండ్ సిస్టం పెట్టుకోవటానికి ఎలాంటి అనుమతి లేదని పెద్ద పెద్ద శబ్ద కాలుష్యం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని డీజేలను రద్దు చేయాలనీ ప్రజల అభ్యర్ధన మేరకు డిజే సౌండ్ సిస్టం పూర్తిగా నిషేధించడం జరిగిందని పేర్కొన్నారు.ఎవరైనా నిబంధనలు ఉల్లఘించి డిజే సౌండ్ సిస్టం పెట్టినట్లయితే అట్టి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ జి. సంతోష్ కుమార్ తెలిపారు.





