నేటితో నామినేషన్ గడువు ముగింపు
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. ప్రతీ పార్టీ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయా లని…ప్రత్యర్ధులపై గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టా లన్నదే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నాయి.లోక్ సభ, ఏపీలోని అసెంబ్లీ, తెలంగాణలోని పార్లమెంట్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేయాల్సిన గడువు నేటితో ముగియ నుంది.కాబట్టి ఇప్పటి వరకు ప్రచారంలో బీజిగా ఉన్న నేతలు నామినేషన్ వేసేం దుకు ఈ ఒక్కరోజు మాత్ర మే సమయం ఉందని ఎన్నికల కమిషన్ మరోసారి గుర్తు చేసింది.రేపు అనగా శుక్రవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ ల ఉపసంహరణకు ఈనెల 29వ తేది వరకు గడువు ఉంది. వచ్చే నెల 13 న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఓట్ల లెక్కిం పు..ఫలితాల ప్రకటిస్తారు.