ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : తహశీల్దార్ వై వెంకటేష్
బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో గురువారం రోజున బూత్ వైస్ అన్ని ఏర్పాట్లు చేయాలని బిఎల్, ఆశా వర్కర్లు, వివిధ పార్టీ నాయకులతో తహశీల్దార్ వై.వెంకటేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం లో తహశీల్దార్ వై వెంకటేష్ మాట్లాడుతూ మండల పరిధిలో 47 బూతులు ఉన్నాయని, మండలంలో మొత్తం 39, 720 ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు అందేలా చూడాలని, ఓటర్లకు త్రాగునీరు సౌకర్యం, ఎమర్జెన్సీ కిట్టు, అందుబాటులో ఉండే విధంముగా బిఎల్జీ, ఆశా వర్కర్లను ఆదేశించారు. అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ టి. వెంకటయ్య, ఆర్.ఐ రాకేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్, ఎంపీటీసీల కోరం అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మన్ రావు, పవన్ ఠాగూర్, నరేష్ చౌహన్, బీఆర్ఎస్ నాయకులు భాను,తదితరులు పాల్గొన్నారు.