పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : తెలంగాణలో లోక్ సభ ఎలక్షన్స్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ బాక్స్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించింది. మే 15లోగా బ్యాలెట్ బాక్సులకు సీళ్లు, అడ్రస్ ట్యాగ్ లను ముద్రించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ను ఆదేశించింది. రాష్ట్రంలో సర్పంచుల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగిసింది. ప్రస్తుతం పంచాయతీల్లో స్పెషల్ అధికారుల పాలన కొనసాగుతోంది.